హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులతో చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్మ్యాప్ను అధికారులు సీఎంకు వివరించారు.
ఔటర్ రింగ్రోడ్ నుంచి రీజినల్రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్మ్యాప్ తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారుల సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు సిద్ధంచేయాలని చెప్పారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రోమార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.