తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. భట్టి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల తనను కలిసి వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని చెప్పారు.