హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (గోల్డ్ కా యిన్) కేసులో 15 ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న కామాక్షి రంగనాథ్ను తెలంగాణ సీఐడీ పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. మనీ సర్క్యూలేషన్ స్కీమ్ ద్వారా మల్టీలెవల్ మార్కెటింగ్కు తెరలేపి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు.
రూ. 32 వేలకే గోల్డ్ కాయిన్ అని, అందుకు రూ.460 రి జిస్ట్రేషన్ చేసుకోవాలని డబ్బులు దండుకున్నారు. ఈ కేసులో కామాక్షి రంగనాథ్ ఏ5గా ఉన్నారు. వరంగల్లో 2008లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. నిందితురాలిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులను ఆ విభాగం ఏడీజీ మహేశ్భగవత్ అభినందించారు.