CS Shanti Kumari | హైదరాబాద్, జనవరి 2: ప్రజాపాలనలో భాగంగా మంగళ వారం నిర్వహించిన అభయహస్తం దరకాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ప్రజాపాలన నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
రాష్ట్రంలోని అన్ని గామపంచాయితీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన గ్రామ సభలలో ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి జిల్లా కలెక్టర్లు వివరించారు.
అన్ని గ్రామ సభల్లో దరఖాస్తుల కొరత ఏర్పడకుండా ముందస్తుగానే అదనపు దరకాస్తులను అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. ఈ అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని సీఎస్ తెలిపారు.