Ration Cards | కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
– కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం
– బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు
– 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం
– 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయింపు
– ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్లు
– కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు.. విచారణ కమిటీ చైర్మన్గా జస్టిస్ పినాకిని చంద్రబోస్
– విద్యుత్ కొనుగోళ్లపైనా మరో కమిటీ.. చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి
– రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం
– యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయం