హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పలు కీలక విషయాలపై మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది.
కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు. అలాగే ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలకు గురి చేస్తున్నది.
ఈ క్రమంలో కొత్త వేరియంట్ రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకునే చర్యలపై, దాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నింటినీ సిద్ధంచేసే ప్రణాళికపై సీఎం సూచనలు తెలుస్తున్నది. వీటితోపాటు పోడుభూములు, దళితబంధు తదితర అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.