హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.