Telangana Cabinet | హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Cabinet Meeting) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఇండ్లు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై చర్చించే అవకాశం ఉన్నది.