హైదరాబాద్, మార్చి7 : రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి రూ.8,327 కోట్లు కేటాయించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్-తుకారాంగేట్ అండర్ బ్రిడ్జ్రి, బహుదూర్పుర ఫె్లైఓవర్ వద్ద అండర్పాస్తో పాటు మరో 30 పె్లైఓవర్లు, 18 ఫుట్ఓవర్ బ్రిడ్జిలను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మెట్రో రైలు పథకంలో పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మార్గాన్ని అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్అండ్బీ పరిధిలోని 1,835 కిలోమీటర్ల రోడ్లకు డబుల్ లైనింగ్ పనులను చేపట్టగా ఇప్పటివరకు 1,651 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్టు వెల్లడించింది. 510 వంతెనలకు గాను 430 వంతెనల నిర్మాణం పూర్తయినట్టు తెలిపింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్ల విస్తరణ జరుగుతున్నదని తెలిపింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్రింగ్ రోడ్డుకు 39 లింకు రోడ్ల నిర్మాణం చేపట్టగా 22 పూర్తయినట్టు పేర్కొన్నది.