హైదరాబాద్ : మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు జరగాలి అనే విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరయ్యారు.