పనులను పరిశీలించిన మంత్రి వేముల
నాణ్యతలో రాజీపడొద్దని ఏజెన్సీకి సూచన
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వర్క్ ఏజెన్సీకి సూచించారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్తేజతో కలిసి పరిశీలించారు.
ఇప్పటికే లోయర్ గ్రౌండ్ త్రవ్వకం పనులు పూర్తయ్యాయి. ఫూటింగ్ పనుల ప్రారంభం కోసం మంత్రి ముగ్గుపోశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని నడిబొడ్డున టీఆర్ఎస్ కార్యాలయం నిర్మితమవుతున్న దని చెప్పారు. ఇంతగొప్ప చరిత్రాత్మక, బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి ప్రశాంత్రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.