హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): సకాలంలో నిధులను విడుదల చేయకుండా పేద దళిత, గిరిజన విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని తెలంగాణ బెస్ట్ అవైలబుల్ సీం పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్, ప్రధాన కార్యదర్శి సటావత్ రమేశ్నాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి పాఠశాలలకు నిధులు చెల్లించామని ఏడాది క్రితం స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార పత్రికాముఖంగా ప్రకటించారని, కానీ ఇప్పటికీ పూర్తి నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు.