వినాయకుడు హైందవంలో ప్రధాన దేవత. అందుకే ఆయన ఇక్కడ తొలి పూజలందుకుంటాడు. అయితే పొరుగున ఉన్న దేశం థాయ్లాండ్లోనూ గణపతిని విఘ్నవినాశకుడిగా, సంపదలకు అధిదేవతగా కొలుస్తారు. అందుకే అక్కడా ఆయన విగ్రహాలు దర్శనమిస్తాయి. అంతేకాదు, అక్కడి ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద రూపాల్లో గణాధిపతిని రూపొందించుకొని ఆయన మీద వాళ్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఆయా విగ్రహాలు వేటికవే విశేషాలు!
ఈ నగరంలోని వాట్ ఫ్రోంగ్ అకాట్ గణపతి దగ్గర నిలబడితే.. మనుషులు చిన్న సైజు బొమ్మల్లా కనిపిస్తారు. కూర్చుని ఉన్న భంగిమలోనే 49 (160 అడుగులు) మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఇది. అంటే దాదాపు 16 అంతస్తుల ఎత్తున కనిపించే విరాట్ రూపం అన్నమాట. దూరం నుంచే ఆ పెద్ద ముఖం, కిరీటం పర్యటకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కూర్చుని ఉన్న గణపతి మూర్తుల్లో ఇది అది పెద్దది. ఇంతకీ బ్యాంకాక్ నుంచి సుమారు రెండు గంటల సమయం ప్రయాణిస్తే ఈ ఊరిని చేరుకోవచ్చు. ఈ అరుదైన గణపతుల ఆశీర్వాదం తీసుకోవచ్చు!
అక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన గణపతి నిలుచుని ఉంటాడు. అదీ ఏకంగా 14 అంతస్తుల ఎత్తున. దానికి మరికొద్ది దూరంలోనే మరో వినాయకుడు కూర్చుని దర్శనమిస్తాడు. సుమారు 16 అంతస్తులంత ఎత్తుతో కనిపిస్తాడాయన. ఈ తరహా విగ్రహాల్లో ఇది నేలమీదే అతి పెద్దది. మరో గులాబీ వర్ణపు ఏకదంతుడు సేదతీరిన భంగిమలో చిద్విలాసాన్ని చిందిస్తాడు. ఆ లంబోదరుడిదీ రికార్డే…. ఇంతకీ వీళ్లంతా ఉన్నది థాయ్లాండ్లోని ఛాఛోంగ్సౌ నగరంలోనే. అందుకే దాన్ని ‘సిటీ ఆఫ్ గణేశ’గా పిలుస్తారు.

సాధారణంగా కూర్చుని లేదా నిలుచుని కనిపించే వినాయకుడి విగ్రహాలకు భిన్నంగా వాట్ సమాన్ రట్టనారామ్ గణపతి ఉంటాడు. ఒక పక్కకు వాలినట్టుగా ఉండే ఈయన నిండైన సుఖానికి ప్రతీతి. ఆ భంగిమలోనూ అది 16 మీటర్ల ఎత్తు 22 మీటర్ల పొడవుతో దగ్గరికి వెళ్లిన వారిని అబ్బురపరుస్తుంది. ఈ తరహా గణపతి ప్రతిమల్లో ఇది భూమి మీదే పెద్దది. ఈ విగ్రహానికి ఉండే గులాబీ వర్ణం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక, ఈ వినాయకుడి చుట్టూ ఉండే మరో 32 గణపతి విగ్రహాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి మూషికుడి చెవిలో తమ కోరికల్ని రహస్యంగా చెప్పే ఆచారం ఉంది. ఆయనే గణపతికి వాటిని విన్నవించి, పని అయ్యేలా సాయపడతారని భక్తుల నమ్మకం.
ఛాఛోంగ్సౌలోని విభిన్నమైన గణేశుల్లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది, ఇక్కడి క్లోంగ్ క్యూయన్ గణేశ్ ఇంటర్నేషనల్ పార్క్లో… నిలుచున్న భంగిమలో కనిపించే వినాయకుడి విగ్రహం. ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టుగా ఉండే ఈ కాంస్య విగ్రహం ఏకంగా 39 మీటర్ల పొడవు ఉంటుంది.

ప్రపంచంలోనే అతి ఎత్తయిన గణపతి విగ్రహం ఇది. పాదాన్ని ముందుకు వేస్తున్న భంగిమను… దేశం, సమాజం, జీవితం మునుముందుకు సాగాలనే భావాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దారు. అంతేకాదు సంపద, పిల్లాపాపలకు, చక్కని పంటలకు గుర్తుగా ఈ గణేశుడు కనిపిస్తాడు. చేతుల్లో ఆయుధాల స్థానంలో మామిడి పండు, అరటి, పనస, చెరకు గడలను పట్టుకొని ఆయన దర్శనమిస్తాడు. 854 విభిన్న భాగాలతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహం నిర్మాణం 2008లో మొదలై 2012లో పూర్తయింది.