హైదరాబాద్ : 2022–23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదించనున్నది. శాసనమండలిలోనూ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదించనున్నారు. ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించారు. అనంతరం వివిధ పద్దులపై శాసనసభ సుదీర్ఘంగా చర్చిస్తున్నది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.