Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు. ప్రభుత్వం సమాధానం అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి.
శాసనసభ ప్రారంభమైన తొలి రోజు కొత్త సభ్యులు, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక మూడో రోజైన నిన్న.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై చర్చ నిర్వహిస్తున్నారు.