హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. 9వ తేదీన బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీల్లో పద్దులపై చర్చించనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. 8, 13వ తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు.
ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.