TS Assembly | శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనున్నది. మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది.
సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మండలి, శాసనసభల్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నది. దళితబంధును ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైనా సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.