Telangana Assembly Elections | సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ విజయం సాధించారు. మొత్తం 45వేల ఓట్లకు పైగా మెజారిటీతో పద్మారావు గౌడ్ గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకూ పద్మారావు భారీ మెజారిటీతో దూసుకెళ్లారు.మొత్తం 45,318 ఓట్లు వచ్చాయి. ఆయన విజయంతో గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.