Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మోటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఎవరెన్ని చెప్పినా చివరికి నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలంటే అన్నదాత చెమటోడ్చి మట్టి నుంచి పచ్చదనాన్ని పిండాల్సిందే. పంటలు పండాల్సిందే. గాదెలు నిండాల్సిందే. అప్పుడే దేశం ఆకలిని తీర్చగలం. అందుకే మన సమాజానికి కేం ద్ర బిందు వు రైతన్నే అంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ రైతు చుట్టూ విధానాలు అల్లుకుంటూ వచ్చారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధికి బాటలు పరిచారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటుతో సాగు స్థిరీకరణకు నాంది పలికారు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది, ప్రశంసలూ అందుకున్నది. దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. ఇది బాగోగులు తెలిసిన ఇంటిమనిషి ఆలోచన. కానీ, జాతీయ పార్టీలుగా సుదీర్ఘకాలం దేశాన్ని పాలించి అధోగతి పాలుచేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు పరాయోళ్లుగానే ఆలోచిస్తున్నరు. కరెంటు మీదనే కన్నేసి రైతు బతుకు మళ్లీ ఆగమాగం చేసే కుట్రలు పన్నుతున్నరు.
3 గంటలు, 10 హెచ్పీ మోటర్లంటూ కాంగ్రె స్ తన నైజాన్ని బయటపెట్టుకున్నది. అటు బీజేపీ అసలుకే ఎసరు తెచ్చే పనిలో తలమునకలుగా ఉంది. సంస్కరణల పేరిట ఉచిత కరెంటుకు ఉరి వేసేందుకు బరి తెగించింది. మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టింది. అలా చేస్తేనే అదనపు నిధుల విడుదలకు ఒప్పుకొంటామని తెగేసి చెప్పింది. ప్రాణం పోయినా మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని అంతే ధాటిగా సీఎం కేసీఆర్ ధిక్కారస్వ రం వినిపించారు. ప్రతీకారంగా కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన రూ.25 వేల కోట్లు ఆపేసింది. సంక్షేమానికి నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచింది. ఇది సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో ప్రజలకు పదే పదే వివరిస్తున్న మాట. ఢిల్లీకి వంగి వంగి సలాములు చేసే రాష్ట్ర బీజేపీ గులాములు కేంద్రం మీటర్లు పెట్టాలని సూచించినట్టు రుజువులు చూపమని సవాల్ విసిరారు. దీనికి జవా బు అనూహ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుంచి రావడం గమనార్హం. మీటర్లు పెట్టిన రాష్ర్టాలకు నిధులిచ్చాం, మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు నిలిపేశామని ఉన్నమాట బయటపెట్టారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుతారని ఆమె మాటలు చెప్పకనే చెప్తున్నాయి. నిబంధనలు, షరతులు వర్తిస్తాయన్న చందంగా మీటర్లు పెట్టకుండా ఉండే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఏదేమైనా సారాంశం ఒక్కటే.
రైతులు, వ్యవసాయం పట్ల బీజేపీ విధానాలు తెలియనివి కావు. కార్పొరేట్ల చేతికి కళ్లాలు అప్పగించడం వారి విధానం. మీటర్లు పెట్టడం, బిల్లులు వసూలు చేయడం, అంతిమంగా ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు అప్పనంగా లాభాలు కట్టబెట్టడం లక్ష్యం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే వేయాలట. ఆ సబ్సిడీని కూడా గ్యా స్ బండ తరహాలో రోజుకింత తగ్గించుకుంటూ పోవాలనేది దీనంతటి వెనుక గల ఆలోచన. నల్ల చట్టాలతో సాగును సమాధి చేయతలపెట్టిన వారికీ, రైతన్నను కడుపులో పెట్టుకొని కాపాడేవారికి ఉన్న తేడా ప్రజలకు తెలుసు. ఇక్కడి ప్రజలు బీజేపీని ఆమడదూరంలో పెట్టి, బీఆర్ఎస్కు పట్టం గట్టింది, కట్టబోయేదీ అందుకే.