హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం శాసన సభలో ప్రభుత్వం నేరుగా బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేసింది. బడ్జెట్పై చర్చకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.
ఉదయం 10 గంటలకు అంతా టీవీలు చూడండి. నిరుద్యోగ యువ సోదరుల కోసం అసెంబ్లీలో ప్రకటన చేస్తానని వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. ‘రేపు 10 గంటలకు అందరూ టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో.. ఏం ప్రకటన చేయబోతున్నామో చెప్తాను’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.