Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 17వ తేదీ(శనివారం) వరకు కొనసాగాయి. మొత్తంగా 8 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగగా, 45 గంటల 32 నిమిషాల పాటు సభ కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. రెండు తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 3 బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఇక ఈ నెల 10వ తేదీన సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.