మహేశ్వరం, ఫిబ్రవరి 28: తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని యునిసెఫ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మం డలం తుమ్ములూరులో ప్రైమరీస్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల పోషణ విధానాన్ని యునిసెఫ్ ప్రతినిధి బృందం సభ్యులు రిచార్డ్ బిటాన్, రాఘవ్ అరోరా, రాహుల్ బన్సాల్, జాన్ స్పార్క్, మోహిని, డానియల్, క్యాతి తివారీ పరిశీలించారు. రాష్ట్రంలో అంగన్వాడీల్లో పిల్లల పోషణ, సంక్షేమంలో అంగన్వాడీ కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.