హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్కు అనుగుణంగా మార్కెటింగ్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సూచనలను పరిగణనలోకి తీసుకొని యాసంగి పం టల ప్రణాళిక రూపొందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళిక ఖరారుపై గురువారం హాకాభవన్లో వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయవర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఏఏ ప్రాంతాల్లో ఏ పంటలు వే యాలి? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ఎంత విస్తీర్ణంలో వేయాలి? మార్కెట్లో పంటల డిమాండ్ ఎలా ఉన్నదనే విషయంపై చర్చించారు. దీనిపై రూ పొందించిన తుది నివేదికను శుక్రవారం ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావుకు అందజేయనున్నారు. దీనిని పరిశీలించాక సీఎం కేసీఆర్ యాసంగి పంటల ప్రణాళికను ఖరారు చేస్తారని నిరంజన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, తెలంగాణ విత్తన కార్పొరేషన్ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, వర్సిటీ శాస్త్రవేత్త జగదీశ్, వ్యవసాయ ఉన్నతాధికారులు, మార్కెట్ రిసెర్చ్ అనాలసిస్ వింగ్ ఎర్నెస్ట్, యంగ్ ప్రతినినిధు లు పాల్గొన్నారు. అనంతరం హాకాభవన్లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని నానో యూరియా సృష్టికర్త రమేశ్రాలియా మర్యాదపూర్వకంగా కలిశారు.