హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. మంగళవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మండలాల ఏర్పా టు ఉత్తర్వులు ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో 15 గ్రామాలతో మాలేగావ్, 12 గ్రామాలతో బెల్తారోడా మండలాలు, వనపర్తి జిల్లాలో 8 గ్రామాలతో ఏదుల మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
15 రోజులపాటు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ను జారీ చేస్తారు. వనపర్తి జిల్లాలో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తురదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలతో కలిపి ఏదుల మండలం, నిర్మల్ జిల్లాలో సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి (బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిగ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని గ్రామాలను కలుపుతూ మాలేగావ్ మండలం, ఇదే జిల్లాలోని ఝరి (కే), వాజ్హరి, బెల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర్ గ్రామాలను కలుపుతూ బెల్తారోడా మండలంగా ప్రతిపాదించింది.