Telangana Assembly Elections | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు తొలిసారి గెలిచినవారే. అందులో యువతే ఎక్కువ ఉన్నారు. ఇంత ఎంత మొత్తంలో డాక్టర్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. వీరే కాకుండా టీచర్లు, అడ్వకేట్లు, ఇంజినీర్లు సైతం ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ఇంజినీర్లు, విద్యాసంస్థల అధినేతలు సైతం ఈ ఎన్నికల్లో గెలిచారు. గంగుల కమలాకర్, కేపీ వివేకానంద్, వేముల ప్రశాంత్రెడ్డి, యశస్వినిరెడ్డి ఇంజినీర్లు కాగా, యెన్నెం శ్రీనివాస్రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. వెడ్మా బొజ్జు (ప్రభుత్వ ఉద్యోగి), జారే ఆదినారాయణ (పీఈటీ), లక్ష్మీకాంతారావు (మాజీ యాంకర్), కే మాణిక్రావు (ఆర్టీవో) పని చేసి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక విద్యాసంస్థల అధినేతలు మర్రి రాజశేఖర్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం విజయబావుటా ఎగురవేశారు. ఐటీ కంపెనీ అధినేత మదన్మోహన్, రంజీ క్రికెటర్ పాడి కౌశిక్రెడ్డి సైతం విజయంసాధించారు. అడ్వకేట్లు కాలేరు వెంకటేశ్, జగదీశ్రెడ్డి సైతం ఘన విజయంసాధించారు.