ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్కు రూ.18,500 చొప్పున ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు.
సాధారణ రకం మిర్చిపంటకు క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.18వేలు పలుకగా, మధ్య ధర రూ.16వేలు, కనిష్ఠ ధర రూ.13వేల చొప్పున వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. తాలు రకం పంటకు సైతం రికార్డుస్థాయి ధర పలికింది.
క్వింటాల్ రూ.8వేల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మిర్చిపంటకు ధర పలుకుతుండడంతో మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.