ఖమ్మం మార్కెట్లో రికార్డు ధర
ఖమ్మం వ్యవసాయం, జూలై 15: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి ఆల్టైం రికార్డు ధర పలికింది. శుక్రవారం ఉదయం జరిగిన జెండాపాటలో రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు.
ఈ పాటలో కేసుపల్లికి చెందిన నర్సింహులు పంటకు రికార్డు స్థాయిలో క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.23 వేలు పలికింది.