ముత్తారం, ఏప్రిల్ 10 : ఆరు నెలల కిందట సాఫ్ట్వేర్ జాబ్ కోల్పోయిన యువకుడికి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదన చెంది హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లపల్లికి చెందిన మారెల్లి సదయ్య, పద్మకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు శ్రవణ్(26) ఉన్నారు.
శ్రవణ్ మూడేండుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆరు నెలల క్రితం జాబ్ కోల్పోయాడు. అప్పటి నుం చి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదనకు గురై గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మారెల్లి శ్రవణ్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శుక్రవారం స్వగ్రామం చేరిన శ్రవణ్ మృతదేహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. నిరుద్యోగంతో శ్ర వణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.