మహబూబ్నగర్ కలెక్టరేట్/ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 7 : గతేడాది మూల్యాంకన, కులగణన పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మహబూబ్నగర్లోని పదోతరగతి స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నిరుటి మూల్యాంకన, కులగణన పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్జేడీ సోమిరెడ్డి వచ్చి హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మధ్యాహ్నం నుంచి స్పాట్ను కొనసాగించారు. కాగా ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.