హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 కింద (ఒక వ్యక్తి లైంగిక వేధింపుల ఉద్దేశంతో పిల్లలకు సైగలు, మాటలు, శబ్దాలు చేయడం వంటివి చేయడం) నేరమని స్పష్టం చేసింది. నిట్ ప్రో ఇంటర్నేషనల్ కేసులో మూడేండ్ల శిక్ష పడే కేసు ప్రకారం మూడేండ్ల వరకు శిక్ష పడే కేసు అయినప్పటికీ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో పిటిషనర్ వాదనను ఆమోదించలేమని జస్టిస్ కే సురేందర్ ఇటీవల తీర్పు వెలువరించారు. మూడేండ్లే గరిష్ఠంగా శిక్ష పడుతుందని, కాబట్టి కాగ్నజబుల్ కేసుగా పరిగణించి (బెయిల్బుల్గా) కేసును కొట్టేయాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ గ్రామంలోని విద్యానగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డీ భాసర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది.