హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పిల్లలంతా ఒక్కచోట చేరితే క్రికెట్, షటిల్, కబడ్డీ, ఖోఖో ఆడుతూ కనిపించేవాళ్లు. మరిప్పుడో.. మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ లాంటి గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. పబ్జీ వంటి గేమ్స్ ఆడే పిల్లలైతే అరేయ్.. వాడిని వేసేయ్రా, వీడి వెనకాలే వెళ్లురా, దూరం నుంచి ఒకడు వస్తున్నడు జాగ్రత్తరా.. అంటూ తలను ఫోన్లో పెట్టేస్తున్నారు. కరోనా వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్లు విపరీ తంగా పెరిగిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక గేమ్, వద్దంటే తినటం మానేసి మారాం చేయటం అలవాటైంది. తల్లిదండ్రులు సైతం ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొంటున్నారు. కొందరు పిల్లలైతే గేమ్స్లో తర్వాతి లెవల్కు వెళ్లేందుకు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తల్లిదండ్రులు డబ్బు కూడా వదిలించుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి రాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడ్వైజరీని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
జాగ్రత్తలివీ
నిఘా పెట్టాల్సిందే..
జాగ్రత్తలివీ..