హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ మేరకు మంగళవారం పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిప్రతం ఇచ్చిన వారిలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి నవాత్ సురేశ్ తదితరులున్నారు.