పెంచికల్ పేట్, డిసెంబర్ 20: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. తరగతి గదుల్లో పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్ది, ఉన్నతమైన గౌరవం పొందాల్సిన ఈ ఉపాధ్యాయుడు.. ప్రేమ పేరిట ఇద్దరు యువతులను వంచించాడు. ఇందులో ఒక యువతిని పెండ్లి చేసుకోగా.. మరొకరితో వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరు కూడా ఆయన ట్రాప్లో పడినట్టు ఉపాధ్యాయవర్గాల్లో ప్రచా రం జోరుగా సాగుతున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన భరత్త్న్ర టీఆర్టీ ద్వారా 2017లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. పెంచికల్పేట్ మండలం అగర్గూడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతితో మూడేండ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి పెండ్లి చేసుకోవాలని అడగగా.. ఏడాదిలోగా చేసుకుంటానని అగ్రిమెంట్ రాసిచ్చా డు. ఆ తర్వాత కూడా పలుమార్లు అడిగినా మాట దాటేస్తూ వస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా.. తాను పనిచేస్తున్న పెంచికల్పేట్ మండలంలోని మరో యువతితో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఈ నిర్వాకం బయటకు రావడంతో యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు యువతిని ఈ నెల 18న పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రానికి చెం దిన యువతి మంగళవారం పోలీసులకు ఫి ర్యాదు చేసింది. తనను మోసం చేశాడని గో డు వెళ్లబోసుకున్నది. ఆమె ఫిర్యాదుతో భరత్ రత్నపై మోసం (చీటింగ్), లైంగిక దాడి కేసు నమోదు చేసినట్టు స్థానిక సీఐ రాజు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.