హైదరాబాద్, ఫిబ్రవరి 28 : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు దరఖాస్తులను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ నెల 15 వరకు గడువు విధించారు. పరస్పర బదిలీ ప్రక్రియలో ఒక ఉద్యోగి ఒక్కరికే కన్సెంట్ ఇచ్చే అవకాశం కల్పించారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అంగీకరించిన ప్రభుత్వం ఫిబ్రవరి 2న ఆ మేరకు జీవో జారీచేసింది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ కోరుకున్న వారికి సీనియార్టీలో రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు.
పరస్పర బదిలీలకు మార్గదర్శకాలు: