TTDP | సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఆగం చేసిన ఆంధ్రా పార్టీలు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఆ పార్టీలు ఇంకా తీరు మార్చుకోవడం లేదు. అయితే టీ-టీడీపీకి మాత్రం ఇంకా ఆంధ్రా వాసన, మూ లాలు పోయినట్టు లేదు. నిజామాబాద్ జి ల్లా ఆర్మూర్లో బుధవారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆంధ్ర రాష్ట్ర గీతమైన ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ను ఆలపించి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విస్మరించారు.
తెలంగాణ నడిబొడ్డున జరుపుకొంటున్న కార్యక్రమంలో కనీసం తెలంగాణ గీతాన్ని ఆలపించక పోవడం, తెలంగాణ తల్లిని స్మరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై.. టీడీపీ నాయకులు విషప్రచారం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.