హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వివిధ వర్గాలు మద్దతు ప్రక టిస్తున్నాయి. తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ సంఘం (టీసీవోస్) వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్ కూడా మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు.