వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. రామప్పను ఇవాళ రత్నాకర్ కడుదుల, వారి బృందం సందర్శించారు.
ఈ సందర్భంగా రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. రామప్పకు యునెస్కో గుర్తింపునకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడంతో.. ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు.
టాక్ ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. రామప్పను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నామని తెలిపారు. రామప్ప ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పేలా కృషి చేస్తామన్నారు.
టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన రామప్ప ఆలయం భావి తరాలకు గుర్తుండి పోతుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సంపదను రాబోయే తరాలకు అందించడానికి ఎంతో సహాయ పడుతుందన్నారు.
రామప్పను సందర్శించిన వారిలో టాక్ వ్యవస్థాపకులు, ఎన్నారై టీఆర్ఎస్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల, ఎన్నారై టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల, స్థానిక సర్పంచ్ రజిత శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తిరుమందాస్ నరేష్ గౌడ్, రవి కుమార్ తదితరులు ఉన్నారు.