హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యోధుడు కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని ప్లాట్ఫాం నంబర్-10లో ఆటోకార్మికుల సంఘం ఆధ్వర్యంలో 200 మంది ఆటోడ్రైవర్లతో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మారయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు రక్షణ ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిని బలిపశువులను చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి ఆటోడ్రైవర్ల కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పోలె నిరంజన్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆటోడ్రైవర్ల నూతన అధ్యక్షుడు రమేశ్, నీజర్, సిద్దులు, కమ్మర్, శీను, జావేద్ తదితరులు పాల్గొన్నారు.