జగిత్యాల, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి, శంకర్గౌడ్ ఆత్మహత్యకు సీఎం రేవంత్రెడ్డే పరోక్ష కారణమని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిందని, ఆ ప్రతిపాదన శాసనసభతోపాటు శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం పొందిందని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపై జాప్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రైవేటీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. శంకర్గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్గౌడ్ మరణం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.