MLC Tata Madhu | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తాను సాగునీటి కష్టాలు చూస్తూ పెరిగానని, తెలంగాణలో నేడు సీఎం కేసీఆర్ కృషితోనే బంగారు పంటలు పండుతున్నాయని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సినిమా నటి లయ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారని, ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారని చెప్పారు.
బీజేపీది నాటి హిట్లర్ నాజీ ఫిలాసఫీ అని, ఆ పార్టీ పాలనలో ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల మాదిరిగా మనదేశంలోనూ అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని తెలిపారు.