పెబ్బేరు, మే 13: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ప్రియదర్శిని జూరాల అతిథిగృహంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములుతో కలిసి వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో నిరంజన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం తరలింపు, మిల్లర్ల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించొద్దని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.