Jagadish Reddy | సూర్యాపేట : స్వరాష్ట్రంలోనే తండాలు అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయం అన్నారు.
తాజాగా సూర్యాపేట మున్సిపాలిటి పరిధి 5, 6 వార్డ్లలోని వస్త్రం తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 150 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామగిరి నగేష్, విజయ సక్రునాయక్ , శ్రీను నాయక్ ఆధ్వర్యంలో చేరికలు జరుగగా, ధనావత్ జోగ్యా నాయక్, టీకం, లాలు, హరియా, రెడ్డి కళ్యాణ్, రాము, శంకర్, ధరావత్ విజయ్, నాగేంద్రబాబు, నాగు, సైదా, పాండు, అచ్చమ్మ, పార్వతి, మాధవి, రంగమ్మ, కవితతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లీలా లింగానాయక్, బాషా మియా, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.