హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూపు సంస్థలపై హిండెన్బర్గ్ పేర్కొన్న అంశాలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాం డ్ చేశారు.
హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అప్పనంగా అప్పజెప్పడంతో గత తొమ్మిదేండ్లుగా గౌతమ్అదానీ గ్రూప్ విపరీతంగా ఆస్తులను పోగేసుకున్నదని విమర్శించారు.