వరంగల్ : గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తమిళి సై గవర్నర్ పదవికి తగ్గ విధంగా హూందాగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారని, బీజేపీ కార్యకర్తలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.
ఈ మేరకు వరంగల్ జిల్లా రాయపర్తిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
గవర్నర్గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయి. బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ..బీజేపీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని ఆయన గుర్తు చేశారు.
తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నాం. కానీ ఆమె బీజేపీ డైరెక్షన్ లో పని చేస్తున్నారని ఆరోపించారు. ఆమె మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా కనీసం మాకు ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. దయచేసి మీరు హూందాగా ప్రవర్తించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.