హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జపాన్ తరహా విధానం అమలుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, ఇతర అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకోసం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలవుతున్న పాడి పెంపకం పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని, విధివిధానాలను రూ పొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పథకంలో పశువుల కొనుగోలుపై రైతులకు రుణాలు, బల్మిల్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పా టు, గ్రామస్థాయిలో పాల నాణ్యతను పరీక్షించే పరికరాలు, మారెటింగ్కు కావాల్సిన సౌకర్యాలు, డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. దీంతోపాటు నేషనల్ ప్రోగ్రాం ఫర్ డెయిరీ డెవలప్మెంట్ పథకం ద్వారా పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు తకువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించి, వారి నుంచి నేరుగా పాలు సేకరించే విధానాన్ని రూపొందించాలని కోరా రు. గ్రామాల్లోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, బ్యాంకులు, పాల ఉత్పత్తి దారుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకొనేలా మార్గం సుగమం చేయాలని చెప్పారు. వివిధ జిల్లాలలో ఉన్న వ్యవసాయ రైతు సేవాకేంద్రాల ద్వారా పాలను సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల మొదటి వారంలో రంగారెడ్డి, నాగర్కర్నూల్, జనగామ జిల్లాల్లో ఎంపిక చేసిన 31 మంది వ్యవసాయ పారిశ్రామిక వేత్తలతో పాల సేకరణ కేంద్రాలఏర్పాటు కోసం సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.