హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పరీక్షల విభాగం డిప్యూటీ కంట్రోలర్గా సంధ్యారాణి మంగళవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సంధ్యారాణి హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. పరీక్ష విభాగానికి ప్రత్యేకంగా 10 మంది అధికారులను నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పరీక్షల విభా గం కన్వీనర్గా ఐఏఎస్ అధికారి సంతోష్, అసిస్టెంట్ ఎగ్జామినర్గా జగదీశ్వర్రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాల్వంచ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ ప్రేమ్రాజ్ను పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్గా నియమించింది.