Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్రంలోని పలువురు తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 16 మంది తహసీల్దార్లు, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక సీసీఎల్ఏ ఆఫీసర్కు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.