అపస్మారక స్థితికి చేరుకొన్న గీత కార్మికుడు
రాజాపేట, జూలై 15 : ప్రమాదవశాత్తు మోకుజారి తాటిచెట్టుపైనే రెండుగంటలపాటు తలకిందులుగా వేలాడు తూ గీత కార్మికుడు అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో శుక్రవారం చోటుచేసుకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండెగోని ధర్మయ్యగౌడ్ కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారింది.
తాటిచెట్టుపైనే రెండు గంటలపాటు తలకిందులుగా వేలాడుతుండగా చుట్టుపక్కల రైతులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కొంతమంది గీతకార్మికులు జేసీబీ సాయంతో ధర్మయ్యగౌడ్ను తాటిచెట్టుపై నుంచి కిందకు దించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.