హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పేస్కేల్ను జూన్ నెల జీతంలో అమలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ లో మార్పులు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందించినట్లు నాయకులు తెలిపారు. గతంలో ఇచ్చిన గ్రేడ్ పేను ఆర్పీఎస్- 2021 బేసిక్లో కలిపి వేస్తారని చర్చలు వస్తున్నాయని, దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.
సూచిక-3లోని సర్యులర్లో గ్రేడ్ పేను బేసిక్ పేలో కలిపి వేస్తూ నూతన సేల్ను ప్రతిపాదించారని, ఇది సరైనది కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్పీఎస్-2017లో కొన్ని స్లాబ్స్ జూనియర్స్, సీనియర్స్ ఒకే సేలులో ఫిక్స్ చేశారని, వివిధ క్యాటగిరీల్లో 19 చోట్ల అలా జరిగిందని తెలిపారు. దీనివల్ల సీనియర్స్కు లాభం లేకుండా పోయిందని దానిని సరిచేయాలని కోరారు. ఇంక్రిమెంట్లు, ఇంటి అద్దెలు, ఇతర అలవెన్స్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకొని, కొత్త సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.