హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న విధానంలో మార్పులు చేయాలని, ఆ బస్సుల బాధ్యతలు అప్పగించాలని ఎస్డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసింది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడాలని, సంస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ మార్చి 12న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ వెల్లడించింది.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే ఈ సదస్సుకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిపింది.